తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు.
ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో ప్రతిపక్షాలను బతకనివ్వడం లేదని ఆమె ఆరోపించారు.ఉస్మానియా ఆస్పత్రి వద్ద టవర్స్ కడతామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారన్న షర్మిల రూ.200 కోట్లతో కడతామన్న హామీ ఏమయిందని ప్రశ్నించారు.