ఏపీ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.బటన్ నొక్కి పంపిణీ చేస్తున్నారని అపహాస్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పాలనలో ఉన్న లోపాలు సరిదిద్ది అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని మంత్రి ధర్మాన తెలిపారు.జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే బలహీనుల అవసరాలు అన్నీ తీరుతున్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే జగన్ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం ఉందని స్పష్టం చేశారు.గతంలో కేంద్రం కూడా అవినీతిపై చేతులు ఎత్తేస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక అవినీతి నిర్మూలన జరిగిందని వెల్లడించారు.







