ఒకే పేరుతో చాలా రైళ్లు ఉంటాయి.. అయితే మనకు కావలసిన రైళ్లని ఎలా గుర్తించాలి?

మనం చాలాసార్లు రైళ్ల విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటాం.దానికి కారణం వాటి పేర్లే అని వేరే చెప్పనవసరం లేదు.

ఇండియన్ రైల్వేలో మనం చూసుకుంటే 22,593 రైళ్లు ఉన్నాయి.వీటిలో సుమారు 9,141 రైళ్లు సరుకు రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు.ప్రతిరోజూ దాదాపు 203.88 మిలియన్ టన్నుల సరుకు రవాణా అవుతోందని సమాచారం.మిగతావి మామ్మూలు రైళ్లు.ఇవి ప్రతిరోజు 2.5 కోట్ల మంది ప్రయాణీకులని వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేర్చుతున్నాయి.భారతీయ రైల్వేలు దాదాపు దేశం మొత్తాన్ని కలుపుతాయి.

ప్యాసింజర్‌ రైళ్లు వివిధ పేర్లతో దేశం మొత్తం నడుస్తాయి.అయితే రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ఒకే పేరుతో ఇక్కడ మనం అనేక రైళ్లు చూడవచ్చు.

అందువలన ఇలాంటి ఒకే పేరు వచ్చే రైళ్లవలన కాస్త సమస్యే అని చెప్పుకోవచ్చు.అయితే తరచూ రైళ్ల ప్రయాణాలు చేసేవారు మాత్రం పెద్దగా ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వరు.

Advertisement

రాజధాని రైల్ అనేది వివిధ రాష్ట్రాల రాజధానులతో కలుపుతుంది.కాబట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది.

అయితే బేసిగ్గా ఇండియన్ రైళ్లకి 3 విషయాల ప్రాతిపదికన పేర్లు పెడుతారు.స్థలాల పేర్లు, నిర్దిష్ట ప్రదేశాల పేర్లు, పార్కులు స్మారక చిహ్నాల పేరుపైనా పెడుతారు.

స్థలాల పేరుపైన నడిచేవి:

1.కల్కా మెయిల్ - ఇది హౌరా నుంచి కల్కా వరకు వెళ్తుంది.2.ముంబై ఎక్స్‌ప్రెస్ - ఇది హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తుంది.3.జైపూర్ ఎక్స్‌ప్రెస్ - ఇది మైసూర్ నుంచి జైపూర్ వరకు నడుస్తుంది.

ప్రదేశాలు, స్మారక చిహ్నాల పేరుపైనా నడిచేవి: నిర్దిష్ట ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, స్మారక చిహ్నాల ప్రాంతాల గుండా కొన్ని రైళ్లు వెళతాయి.అందువల్ల వాటి పేర్లు వచ్చేవిధంగా పేర్లు పెడుతారు.ఈ రైళ్లలో చాలా వరకు నది పేర్లు, పార్కుల పేర్లు, ప్రాంతాల పేర్లు ఉంటాయి.1.ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ - హైదరాబాద్ నుంచి హౌరా వరకు.2.మలబార్ ఎక్స్‌ప్రెస్ - మంగళూరు నుంచి తిరువనంతపురం వరకు.3.రణతంబోర్ ఎక్స్‌ప్రెస్ - జోధ్‌పూర్ నుంచి ఇండోర్ వరకు.4.కార్బెట్ పార్క్ ఎక్స్‌ప్రెస్ లేదా కాజిరంగా ఎక్స్‌ప్రెస్.5.చార్మినార్ ఎక్స్‌ప్రెస్, తాజ్ ఎక్స్‌ప్రెస్ - చెన్నై నుంచి హైదరాబాద్‌ వరకు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

రాజధానులని అనుసంధానం చేసే రైళ్లు: రాజధాని ఎక్స్‌ప్రెస్ - ఇది దేశ రాజధాని ఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులకి కలుపుతుంది.దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఈ పేరుతో రైళ్లు నడుస్తున్నాయి.గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ - ఇది డీలక్స్ రైలు.

Advertisement

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ - ఇవి దేశ రాజధాని ఢిల్లీని ప్రధాన రాష్ట్రాలతో అనుసంధానించే సాధారణ సూపర్‌ఫాస్ట్ రైళ్లు.బీహార్ సంపర్క్ క్రాంతి, రాజస్థాన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఇలా పేర్లు ఉంటాయి.

తాజా వార్తలు