హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది.వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు ధర పలికింది.రూ.24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు.గతేడాది వేలంలో మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.9 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోగా… ఈ సారి అంతకు మించి రూ.అమ్ముడు పోయింది.
26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్ గణేష్ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది.ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూకు పూజలు నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు.ఈసారి నిర్వహించిన వేలం పాటలో 28 మంది పాల్గొన్నారు.
బాలాపూర్ గణేషుడి లడ్డూ ప్రతి ఏడాది 21కిలోల బరువుతో తయారు చేస్తారు.బాలాపూర్ లడ్డూ సంప్రదాయం 1980లో ప్రారంభమవ్వగా.
వేలం మాత్రం 1994లో మొదలైంది.విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం.
ఈ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం.అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతోపాలు ప్రముఖులు సైతం పోటీపడతారు.
బాలాపూర్ లడ్డూ వేలం పాట వివరాలు
1994లో కొలను మోహన్రెడ్డి.రూ.450 1995లో కొలను మోహన్రెడ్డి.రూ.4,500 1996లో కొలను కృష్ణారెడ్డి.రూ.18,000 1997లో కొలను కృష్ణారెడ్డి… రూ.28,000 1998లో కొలను మోహన్రెడ్డి.రూ.51,000 1999లో కల్లెం ప్రతాప్రెడ్డి.రూ.65,000 2000లో కల్లెం అంజిరెడ్డి.రూ.66,000 2001లో రఘునందన్చారి.రూ.85,000 2002లో కందాడ మాధవరెడ్డి.రూ.1,05,000 2003లో చిగిరింత బాల్రెడ్డి.రూ.1,55,000 2004లో కొలను మోహన్రెడ్డి…రూ.2,01,000 2005లో ఇబ్రహీం శేఖర్… రూ.2,80,000 2006లో చిగిరింత శేఖర్రెడ్డి.రూ.3,00,000 2007లో రఘునందర్చారి.రూ.4,15,000 2008లో కొలను మోహన్రెడ్డి… రూ.5,07,000 2009లో సరిత రూ.5,15,000 2010లో కొడాలి శ్రీధర్బాబు.రూ.5,25,000 2011లో కొలను బ్రదర్స్… రూ.5,45,000 2012లో పన్నాల గోవర్థన్రెడ్డి… రూ.7,50,000 2013లో తీగల కృష్ణారెడ్డి… రూ.9,26,000 2014లో సింగిరెడ్డి జైహింద్రెడ్డి…రూ.9,50,000 2015లో కొలను మదన్ మోహన్రెడ్డి… రూ.10,32,000 2016లో స్కైలాబ్రెడ్డి… రూ.14,65,000 2017లో నాగం తిరుపతిరెడ్డి… రూ.15,60,000 2018లో శ్రీనివాస్గుప్తా.రూ.16,60,000 2019లో కొలను రామిరెడ్డి… రూ.17,60,000 2020 కరోనా వల్ల వేలం పాట పాడలేదు.– 2021లో మర్రి శశాంక్రెడ్డి,ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్… రూ.18,90,000