భర్తను రోకలితో కొట్టి చంపిన భార్య !

వేధింపులు భరించలేక ఓ మహిళ తన భర్తను రోకలితో కొట్టి చంపింది.పెళ్లై 20 రోజులకే భార్య ఈ దుర్మార్గానికి పాల్పడింది.

 Telangana, Golkonda, Wife, Murder, Husband-TeluguStop.com

మద్యంకి బానిసైన భర్త తరచూ గొడవలకు దిగడం, బండబూతులు తిట్టడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

టప్పాచబుత్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన గోల్కొండ జిల్లా ముజాహెద్ నగర్ లో చోటు చేసుకుంది.కాలనీకి చెందిన అస్లాం (25), సమ్రిన్ దంపతులు.వీరికి గత నెల (ఆగస్టు) 19వ తేదీన వివాహం జరిగింది.

సంతోషంగా సాగాల్సిన వీరి జీవితం రోజూ గొడవలకే పరిమితమయ్యేది.పెళ్లి రోజు నుంచే అస్లాం తాగి వచ్చి గొడవలకు దిగేవాడు.

రోజూ బండబూతులు తిడుతూ వేధించేవాడు.గురువారం రాత్రి కూడా తాగి ఇంటికి రావడంతో వీరి మధ్య గొడవ చెలరేగింది.

అలా గొడవ పడి అస్లాం పడుకున్నాడు.శుక్రవారం ఉదయం పూట భార్య సమ్రిన్ రోకలితో అస్లాం తలపై బాదింది.

దీంతో అస్లాం గట్టిగా కేకలు వేయడంతో ఇంటి సభ్యులు అక్కడి చేరుకున్నారు.తలపై గాయమవడంతో తీవ్ర రక్తస్రావమైంది.

దీంతో అస్లాంను కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్లాం మరణించాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.ఈ మేరకు అస్లాం భార్య సమ్రిన్ ను అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube