బాలుడిని పరామర్శించిన మాజీ ఎంపీటీసీ

తహశీల్దార్ కు కృతజ్ఞతలు తెలిపిన బాలుడి తల్లిదండ్రులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములోని అంబేడ్కర్ నగర్ కు చెందిన ఏర్పుల రాజు(5) గత మూడు రోజుల క్రితం ఆపరేషన్ జరుగగా రాజు ను మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ బాలుడి ఇంటికి వెళ్ళి పరామర్శించారు.

రాజు ను పరీక్షించిన వైద్యులు రాజు కు ఆపరేషన్ అవసరమని బాలుడి తండ్రి దేవయ్య కు చెప్పగా కొత్త రేషన్ కార్డులు బాబు పుట్టినప్పటి నుండి అందులో బాలుడి పేరు లేదు.దీంతో ఏమి చేయాలో అర్థం కాక స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ను కలవగ ఆపరేషన్ కు అవసరమగు సర్టిపికెట్ కావాలని వైద్యులు దేవయ్య కు సూచించారు.

ఇట్టి విషయాన్నీ మండల తహశీల్దార్ జయంత్ కుమార్ కు ఆరోగ్య శ్రీ లో ఆపరేషన్ చేయడానికి అవసరమగు సర్టిఫికెట్ వెంటనే జారీ చేశారు.సర్టిఫికెట్ తీసుకుని బాలుడి తండ్రి దేవయ్య సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించగా విజయవంతం అయినది.

ఆపరేషన్ కు అవసరమైన సర్టిఫికెట్ జారీ చేసిన ఎమ్మార్వో జయంత్ కుమార్ కు రాజు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News