నమీబియా నుంచి భారత్ కు ఇటీవలే ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.దాదాపు 50 రోజుల పాటు క్వారంటైన్ తర్వాత వీటిలో రెండు చీతాలను ఫ్రెడ్డీ, ఎల్టోన్ లను పెద్ద ఎన్ క్లోజర్ లోకి వదిలారు అధికారులు.
పెద్ద ఎన్ క్లోజర్ లోకి వెళ్లిన 24 గంటల్లోనే తొలివేటను పూర్తి చేశాయి.సాయంత్రం 6 గంటల సమయంలో ఓ మచ్చల జింకను ఇవి వేటాడాయి.
అయితే, క్వారంటైన్ లో చీతాల కండరాలు బలహీన పడి ఉంటాయేమోననే ఆందోళన చెందిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఊహించిన దాని కంటే వేగంగా చీతాలు వేటను పూర్తి చేసుకున్నాయని తెలిపారు.
మిగిలిన చీతాల్లో ఐదింటిని త్వరలోనే పెద్ద ఎన్ క్లోజర్లలోకి వదులుతామని వెల్లడించారు.వీటిలో ఆశా అనే చీతా గర్భంతో ఉందని భావిస్తున్నారు.74 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ మన దేశంలోకి వచ్చిన విషయం తెలిసిందే.