దసరా పండుగతోనే తెలంగాణలో కేసీఆర్ పాలనకు స్వస్తి పలుకుదామని కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
కేసీఆర్ కుటుంబ, దుర్మార్గ పాలన విముక్తి కోసమే తన పోరాటమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.అయితే తనపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్ పై తన పోరాటం ఆపలేదన్నారు.
ఇకపై కూడా పోరాటాన్ని ఆపబోయేది లేదని కోమటిరెడ్డి వెల్లడించారు.అయితే బీజేపీపై అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే వార్త చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.







