ఓ రాష్ట్ర సీఎంకు ఉద్యోగి చల్లటి మరియు రుచి లేని టీని తయారు చేశాడని అతనికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.ఇదేంటి ఇంత చిన్న విషయానికి అంతటి చర్యలు అవసరమా అనిపిస్తోంది కదా ఇది వింటుంటే.
అవునండీ నెటిజెన్లు ఇలాగే వ్యతిరేకించారు.దీంతో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకున్నారు.
ఇదెక్కడ జరిగింది, ఎవరు ఏ సీఎంకు చల్లటి టీ ఇచ్చారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండ్రోజుల కింద భోపాల్ నుంచి రేవా వెళ్లారు.
మధ్యలో ఛతర్ పుర్ జిల్లా ఖజురహో విమానాశ్రయంలో ఆగారు.అయితే సీఎం రాక సందర్భంగా టీ, అల్పాహారం, ఇతర ఏర్పాట్లన్నీ చేసే బాధ్యతను జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కన్హువాకు అప్పగించారు.
అయితే అతను దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు.కానీ సీఎం అక్కడకు రాకుండానే వెళ్లిపోయారు.
కానీ సీఎం కోసం అతను తయారు చేసిన టీ రుచి లేదంటూ, చల్లగా ఉందంటూ అధికారులు మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చారు.ఇది కాస్త నెట్టింట వైరల్ అయింది.
సీఎం తాగకుండానే చల్లని ఛాయ్ ఇచ్చాడని.నోటీసులు ఇవ్వడం ఏంటంటూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉన్నతాధికారులు నోటీసులను ఉపసంహరించుకున్నారు.
విషయం తెలుసుకున్న నెటిజెన్లు ఉద్యోగికి అండగా నిలబడుతున్నారు.వాళ్లు ఏం చేసినా నిన్ను ఉద్యోగం లోంచి తీసేయలేరంటూ భరోసా ఇస్తున్నారు.
వీరందరూ చూపుతున్న ప్రేమకు ఉద్యోగి హర్షం వ్యక్తం చేశాడు.నెటిజెన్ల వల్లే తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.