అంతరాయం లేకుండా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.మున్నేరు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్వినాయక నిమజ్జనం సందర్భంగా ఏలాంటి అంతరాయం లేకుండా పకడ్బంది ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తో కలసి కాల్వోడు సమీపంలోని మున్నేరు, నాయుడుపేట వైపు వున్న మున్నేరు ప్రాంతాలను సందర్శించారు.నిమజ్జనం సమయంలో తీసుకొవాల్సిన జాగ్రత్త చర్యలపై దిశనిర్ధేశం చేశారు.జిల్లా పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ , R&B, వైద్య, విధ్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
సంబంధిత అధికారుల పర్యవేక్షణలో సకాలంలో సజావుగా నిమజ్జనం ముగిసేవిధంగా ఉత్సవ కమిటీలు చొరవ తీసుకొవాలని సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ డీసిపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ కలెక్టర్ మధుసూదనరావు,పోలీస్, రెవెన్యూ ,వైద్య ,విధ్యుత్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.