ట్రాఫిక్ సిగ్నల్ సరిచేసి వాహనదారుల ప్రాణాలను కాపాడిన డెలివరీ బాయ్..

చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద ప్రమాదాలను నివారించగలవు.పౌర బాధ్యత మనందరికీ ఉంది.

కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి సమాజానికి సేవ చేయాలి.తాజాగా ఒకటి డెలివరీ బాయ్ ఇతరుల కోసం ఒక మంచి పని చేసి సోషల్ మీడియాలో చాలామంది ప్రశంసలను అందుకుంటున్నాడు.

జీషన్ అహ్మద్ ఇర్షాద్ అహ్మద్ అనే ఈ డెలివరీ మ్యాన్ దుబాయ్‌( Dubai )లో ట్రాఫిక్ సిగ్నల్ సరిచేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాడు.అతను ఈ సమయంలో ధైర్యం, పౌర బాధ్యతను చాటాడు.

The Delivery Boy Who Fixed The Traffic Signal And Saved The Lives Of Motorists,

అసలేం జరిగిందంటే.జీషన్ తన బైక్‌పై వెళ్తుండగా, అల్ వాస్ల్ స్ట్రీట్‌లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ ప్రమాదకరంగా వేలాడుతున్నట్లు చూశాడు.ఎవరూ పట్టించుకోకపోవడంతో, జీషన్( Zeeshan ) స్వయంగా చర్యలు తీసుకున్నాడు.

Advertisement
The Delivery Boy Who Fixed The Traffic Signal And Saved The Lives Of Motorists,

బైక్ దిగి, ట్రాఫిక్ సిగ్నల్‌ను సరిచేసి, ప్రమాదం జరగకుండా అడ్డుకున్నాడు.ఒక బాటసారి జీషన్ ధైర్యసాహసాన్ని చూసి, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

వీడియో వైరల్ కావడంతో, రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ( RT A) జీషన్‌ను గుర్తించి సన్మానించింది. జీషన్‌ను RTA ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి, ప్రశంసా పత్రంతో సత్కరించారు.

జీషన్ పాకిస్తాన్‌కు చెందినవాడు.దాదాపు పదేళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నాడు.

The Delivery Boy Who Fixed The Traffic Signal And Saved The Lives Of Motorists,

జీషన్ చర్యలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.అతని నైతికత, పౌర బాధ్యతను అందరూ ప్రశంసించారు."అటువంటి చర్యలు అభివృద్ధి చెందుతున్న సమాజానికి చాలా అవసరం.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

" అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కామెంట్ చేశాడు.మరొకరు "ప్రపంచంలో జీషన్ లాంటి వ్యక్తులు చాలా అరుదు.

Advertisement

సమాజం పట్ల బాధ్యత చాలా ముఖ్యమైనది." అని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు