విశాఖ సాగర తీరం అందాల తిరంగా మారనుంది. సీఎం చొరవతో పర్యాటకంగా విశాఖ అభివృద్ధి.

విశాఖ సాగరతీర ప్రాంతంపరిశుభ్రంగా ఉండాలని పార్లే ఫర్ ఓసన్ సంస్థ తో ఎంఓ యు ప్రభుత్వం కుదుర్చుకోనుందని ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 The Coast Of Visakhapatnam Will Become A Beauty Spot. Tourism Development Of Vis-TeluguStop.com

విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థలను తొలగించండం పై ఎం ఓ యు జరగనుందని పేర్కొన్నారు.

ప్రపంచ పటంలో 28 కిలోమీటర్ల దారి పొడవున సముద్రం ఉన్న ఏకైక నగరం.సుందర విశాఖ నగరం అని ఆయన అన్నారు అయితే ఈనెల 26 తేదీన విశాఖలో సీఎం పర్యటిస్తు నట్లు తెలిపారు.

సీఎం పర్యటన విజయవంతంపై పార్టీ నాయకులతో చర్చించినట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు .మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన 7200 మందికి సర్టిఫికెట్లను సీఎం చేతుల మీదగా అందించనున్నరని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి,వంశీకృష్ణ శ్రీనివాస్ , శాసనసభ్యులు అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి , సమన్వయ కర్తలు కె.కె రాజు, అకరమాని విజయ నిర్మల ,యాదవ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్, జిల్లా పరిషత్ చైర్మెన్ సుభద్ర పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube