తిరుమలకు వెళ్లే అలిపిరి( Alipiri ) నడకమార్గంలో చిన్నారిపై దాడి చేసిన చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.గత ఏడాది ఆగస్ట్ లో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత ( cheetah )పాపను చంపేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నడక మార్గంలో సంచరిస్తున్న ఆరు చిరుతలను టీటీడీ విజిలెన్స్ మరియు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.ఈ క్రమంలో అధికారులు బంధించిన నాలుగో చిరుతే లక్షితపై దాడి చేసినట్లు గుర్తించారు.
లక్షితపై దాడి చేసిన చిరుతను ఎస్వీ జూ పార్కులోనే ఉంచి సంరక్షించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.