కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుడి పై ఆర్థిక భారం వేస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెనక్కి తీసుకోవాలన్నారు.
ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.పేదలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయన్నారు.దేశం నుంచి తరిమి కొట్టే వరకు బీజేపీకి బుద్ది రాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు