కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు.
కేసీఆర్ కు రెండు చోట్లా ఓటమి తప్పదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.కేసీఆర్ కు సహకరించేందుకే కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు.
అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.