భారత్ జోడో యాత్ర అందుకే.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజా సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తనివ్వడం లేదని ఆరోపించారు.

అందుకే దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రను చేపట్టినట్టు తెలిపారు.యాత్రకు ముందు పార్లమెంట్ లో సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేశామన్నారు.

కానీ ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి తమను అనుమతించలేదని ఆరోపించారు.న్యాయవ్యవస్థ లేదా పత్రికా వ్యవస్థల ద్వారా కూడా ప్రజా సమస్యలను వివరించలేకపోతున్నామని వెల్లడించారు.

దేశంలో న్యాయ, పత్రికా వ్యవస్థలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి గురవుతున్నాయని పేర్కొన్నారు.అందుకే కన్యాకుమారి నుంచి యాత్రను ప్రారంభించామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Advertisement
మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!

తాజా వార్తలు