రాజన్న సిరిసిల్ల జిల్లా: కార్మికుల గోడు మంత్రి కేటీఆర్ కి వినబడడం లేదా అని ప్రశ్నించిన టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్, కార్యదర్శి కోడం రమణ.
మంత్రి కేటీఆర్ వెంటనే కార్మికులకు రావాల్సిన సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టెక్స్ టైల్ పార్కు అభివృద్ధి , కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే వారికే మా మద్దతు ఉంటుందని ప్రకటన చేశారు.