శ్రీ సత్యసాయి జిల్లా( Sri Sathya Sai District ) పెనుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పెనుకొండ నియోజకవర్గ టీడీపీలో ( TDP ) అసమ్మతి జ్వాల చెలరేగింది.
నియోజకవర్గ అభ్యర్థిగా సవితను( Savita ) పార్టీ అధిష్టానం కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి( BK Parthasarathi ) వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీలను చించేసిన పార్థ సారథి వర్గీయులు రోడ్డుపై బైఠాయించి నిరనసకు దిగారు.అనంతరం ఫ్లెక్సీలను దగ్ధం చేశారు.చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసిన పార్థసారథి వర్గీయులు హైకమాండ్ ప్రకటించిన అభ్యర్థి సవితను ఓడించి తీరుతామని వెల్లడించారు.