ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పార్టీ కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Tension In Ntr's District Gollapudi-TeluguStop.com

చీకటి జీవో కోసమే కందుకూరు, గుంటూరు సభల్లో ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే జీవో ప్రతులను మాజీ మంత్రి దేవినేని, పార్టీ నేతలతో కలిసి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్నారు.

దేవినేనిని అదుపులోకి తీసుకోవడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో గొల్లపూడి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube