మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
జిల్లాలో ఓ బాలికను సొంత బాబాయితో పాటు మరోక వ్యక్తి అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బాలిక మృతికి కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిందితులను పోలీసులు కాపాడుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆస్పత్రి వద్ద బాలిక మృతదేహంతో పోలీసులకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు నినాదాలు చేస్తున్నారు.
దీంతో ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.