ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.కొన్ని సందర్భాల్లో ఆ ట్రోల్స్ పాజిటివ్ గా వస్తుంటే మరికొన్ని సందర్భాల్లో నెగిటివ్ గా వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో మంచు విష్ణుపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేసే సమయంలో చేసిన కామెంట్లు విష్ణుకు ఒకింత మైనస్ అయ్యాయి.
ఆ సమయంలో తెలుగులో మాట్లాడుతూ మంచు విష్ణు తప్పుగా చేసిన కొన్ని కామెంట్లు ఆయనకు శాపంగా మారాయి.అయితే ట్రోల్స్ వల్ల మంచు విష్ణు మాత్రం మరింత పాపులర్ అయ్యారు.
అయితే మంచు విష్ణుకు ట్రోల్స్ వల్ల పాపులారిటీ పెరిగినా ఆయన సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడింది.ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కూడా ట్రోల్స్ వల్ల ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.

ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే చంద్రహాస్ కు ఈ స్థాయిలో పాపులారిటీ దక్కింది.ఈ ట్రోల్స్ వల్ల చంద్రహాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు భారీగా బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.ది లెజెండ్ సినిమా ద్వారా అరుల్ శరవణన్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.అరుల్ శరవణన్ పై ఏ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ ముగ్గురు హీరోలు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.మంచు విష్ణు జిన్నా సినిమాతో డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్నా ఆ సినిమా బిజినెస్ విషయంలో మంచి ఫలితాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమా ద్వారా మంచు విష్ణుకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.హిందీ హక్కులు భారీ మొత్తానికి అమ్మడవడంతో జిన్నా మూవీకి లాభాలు వచ్చాయి.







