టాలీవుడ్ లో ఆగష్టు నెల మొత్తం షూటింగులు జరుగక సందడి లేకుండా పోయింది.గత నెల అంతా నిర్మాతల బంద్ కారణంగా 24 క్రాఫ్ట్స్ వారు ఖాళీగా కనిపించారు.
మరి టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలను నిర్మాతల బృందం చాలా వరకు పరిష్కరించడంతో సెప్టెంబర్ 1 నుండి షూటింగులు యథావిథిగా జరుగుతున్నాయి.
దీంతో మళ్ళీ ఒక్కొక్కరిగా షూటింగ్ లను స్టార్ట్ చేస్తున్నారు.
మరి బంద్ తర్వాత ప్రెజెంట్ ఎవరెవరు షూటింగ్ స్టార్ట్ చేసి బిజీగా ఉన్నారో తెలుసుకుందాం.మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇందులో మహేష్ కూడా జాయిన్ కాబోతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి గత రెండు రోజుల క్రితమే బాబీ సినిమాలో జాయిన్ అయ్యాడు.
అలాగే రామ్ చరణ్ మరియు శంకర్ సినిమా కూడా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ప్రభాస్ సలార్ షూటింగ్ కూడా రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతుంది.
ఇంకా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి.

అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ NTR30 సినిమాలు మరి కొద్దీ రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నాయి.బాలయ్య కూడా తన 107వ సినిమా సెట్ లో జాయిన్ అయినట్టు టాక్.ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇలా పెద్ద హీరోలు అందరు కూడా షూటింగులకు సిద్ధం అవుతుండడంతో టాలీవుడ్ లో మళ్ళీ సందడి వాతావరణం కనిపిస్తుంది.







