వైరల్: దుబాయ్ లో భార్య కోసం తెలంగాణ వ్యక్తి ఏం చేశాడో తెలుసా... ?

కరోనా మహమ్మారి కారణంగా భారతదేశంలోని కార్మికలే కాకుండా విదేశాల్లో ఉన్న కార్మికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇతర దేశాల్లో బతకలేక కుటుంబాన్ని చూడలేక వారు మానసికంగా బాగా కృంగిపోతున్నారు.

విమాన రాకపోకలకు ఏ దేశ ప్రభుత్వాలు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.దీంతో ఏ దేశం లో చిక్కుకుపోయిన వారు ఆ దేశం లోనే మగ్గిపోవాల్సి వస్తుంది.

కొత్తగా పెళ్లయి కరోనా కారణంగా దూరమైన నవ దంపతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.తాజాగా తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి దుబాయ్ లో తన భార్యను తలుచుకుంటూ కింద పడిపోయిన పూలను, ఆకులను సేకరించి హార్ట్ సింబల్ గా పేర్చాడు.

అయితే ఇది చూసిన ఒక వ్యక్తి అతడిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఇది 2020 సంవత్సరంలో ఒక ఉత్తమ ఫోటో.మనందరం మనకు ఇష్టమైన వాళ్ళని బాగా మిస్ అవుతున్నాం అని ఆ ఫోటో పోస్ట్ కింద రాశాడు.

Advertisement

దీంతో ఆ ఫోటో తెగ వైరల్ అయింది.ఈ పోస్టు మిలియన్ల ప్రజలకు చేయడంతోపాటు వేల సంఖ్యలో లైకులు కూడా సంపాదించింది.

దీంతో అతడు ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయ్యాడు.ప్రముఖ వార్తా కథనం ప్రకారం ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రమేష్ కాగా అతనికి 2019 సంవత్సరం సెప్టెంబర్ నెలలో లత అనే ఒక యువతితో పెళ్లయింది.

అయితే పెళ్లయిన నెల రోజుల్లోనే అతడు దుబాయ్ దేశానికి బ్రతుకు తెరువు నిమిత్తం వెళ్ళాడు.ఎమ్రిల్ సర్వీసెస్ ఎల్ఎల్సీలో హౌజ్ కీపింగ్ స్టాఫ్ గా చేరి దాదాపు పది నెలల పాటు అక్కడే పనిచేస్తున్నాడు.

అతను దుబాయ్ కు వెళ్లిపోగా లత ఇండియాలోనే ఉండిపోయింది.రమేష్ చాలాసార్లు ఇంటికి వెళ్ళి తన భార్యతో సమయం గడపాలి అనుకున్నాడు కానీ లాక్ డౌన్ కారణంగా వెళ్ళలేక పోయాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

తన భార్యను బాగా మిస్ అవుతున్నాను అని కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నట్లయితే బాగుండేదని రమేష్ వార్తా పత్రికతో చెప్పుకొచ్చాడు.సోషల్ మీడియాలో తన ఫోటో వైరల్ అయినందుకు గాను ఆశ్చర్యపోతూ ఈ విషయం తన భార్యకు తెలిస్తే ఆమె బాగా సంతోష పడుతుందని అతను చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు