తెలంగాణలో చాలాకాలం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ తరఫున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.“టీడీపీ శంఖారావం” పేరిట సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదు నుండి భారీ కాన్వాయ్ తో ఖమ్మం బయలుదేరారు.ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సరిహద్దు లలో చంద్రబాబుకి టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబు కాన్వాయ్ గుండా వందల సంఖ్యల వాహనాలతో తెలంగాణ టీడీపీ కార్యకర్తలు బయలుదేరడం జరిగింది.చాలాకాలం తర్వాత తెలంగాణలో చంద్రబాబు ఎంట్రీతో టీడీపీ క్యాడర్ లో జోష్ నెలకొంది.
చంద్రబాబు రాకతో తెలంగాణ టిడిపి మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు తాజా వాతావరణం కనిపిస్తుంది.కాసాని జ్ఞానేశ్వర్ నీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత తొలి భారీ బహిరంగ సభ కావడంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
దీంతో ఇప్పుడు ఖమ్మం మొత్తం పసుపు మయం అయింది.సర్దార్ పటేల్ స్టేడియంకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తూ ఉండటంతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి.







