తెలంగాణలో రెండో అసెంబ్లీ గురువారం ప్రారంభం అయ్యింది.బుధవారం ప్రొటెం స్పీకర్గా చార్మినార్ ఎమ్మెల్యే, ఎంఐఎం సభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించిన వెంటనే అసెంబ్లీ వాయిదా పడింది.119 సభ్యులకుగానూ 114 మంది ప్రమాణం చేశారు.అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, రాజా సింగ్ సభకు హాజరుకాలేదు.
పార్టీల వారీగా నూతన సభ్యుల వివరాలు …
టీఆర్ఎస్
ముఠా గోపాల్ (ముషీరాబాద్), కాలేరు వెంకటేశ్ (అంబర్పేట), బేతి సుభాష్ రెడ్డి (ఉప్పల్), బొల్లం మల్లయ్య యాదవ్ (కోదాడ), కంచర్ల భూపాల్ రెడ్డి(నల్లగొండ), సుంకే రవిశంకర్(చొప్పదండి), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), పట్నం నరేందర్ రెడ్డి (కొడంగల్), బాల్క సుమన్(చెన్నూరు), క్రాంతికిరణ్ (అందోల్), సీహెచ్ మల్లారెడ్డి (మేడ్చల్), మెతుకు ఆనంద్ (వికారాబాద్), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (వనపర్తి), నన్నపనేని నరేందర్ (వరంగల్ తూర్పు), సంజయ్ కుమార్(జగిత్యాల), కొప్పుల మహేశ్ రెడ్డి (పరిగి)
కాంగ్రెస్
మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూరు), బానోతు హరిప్రియ నాయక్(ఇల్లెందు), ఎం నాగేశ్వర్ రావు(అశ్వారావుపేట), కె.ఉపేందర్ రెడ్డి (పాలేరు), హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), సురేందర్(ఎల్లారెడ్డి)
స్వతంత్ర అభ్యర్థులు
రాములు నాయక్ (వైరా), కోరుకంటి చందర్ (రామగుండం)
.