నా దగ్గర డబ్బుల్లేవ్ ఉన్నా నేను ఇవ్వను

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముక్కుసూటిగా మాట్లాడుతూ, ఎప్పుడూ సంచలన విషయాలపై తనదైన శైలిలో స్పందించే సంగారెడ్డి ఎమ్యెల్యే తూర్పు జగ్గారెడ్డి మరోసారి సంచలమైన విషయాలు చెప్పి వార్తల్లోకి ఎక్కారు.

త్వరలో తెలంగాణా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందరభంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను అంతా కలిసికట్టుగా కష్టించి పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.ఎన్నికల ఇంఛార్జీ, ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు కలిసి అభ్యర్థిని ఎంపిక చేయాలనీ ఆయన సూచించారు.

టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే ఖర్చు కన్నా ఎక్కువ డబ్బులు మనం ఖర్చు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో అస్సలు తాను జోక్యం చేసుకోనని జగ్గారెడ్డి క్లారిటీ గా చెప్పారు.

నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు లేవని, ఉన్నా నేను ఎవరికీ ఇవ్వనని, అసలు డబ్బుల టెన్షన్ నాకు పెట్టవద్దు అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.మీరంతా కష్టపడి ఐక్యంగా పని చేసి పోటీ చేసిన వారంతా గెలిచి రావాలన్నారు.

Advertisement

మీరు గెలవకపోతే ఎమ్మెల్యేగా నాకు ఎక్కడా గౌరవం ఉండదు.టిక్కెట్ విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి కో ఆప్షన్ మెంబర్‌గా అవకాశం కల్పించే బాధ్యత నాదేనని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు