ఢిల్లీ వేదికగా తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక మంతనాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ఇంటి వద్ద ఆశావహులు క్యూ కట్టారు.
మాజీ మంత్రి రేణుకాచౌదరి నేతృత్వంలో కమ్మ సామాజిక వర్గ నేతలు మురళీధరన్ తో కీలక సమావేశం నిర్వహించారు.టికెట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నిన్న కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను కలిసిన కమ్మ నేతలు ఇవాళ మురళీధరన్ తో భేటీ అయ్యారు.తమ వినతులను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని రేణుక చౌదరి తెలిపారు.
ఈ నేపథ్యంలో మరో రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉంటామన్న ఆమె అవసరం అయితే ప్లాన్-బి ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.







