బంపర్ ఆఫర్: నల్లా బిల్లులు కట్టని వారికి మాత్రమే..!

నల్లా బిల్లులు కట్టని వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

పెండింగ్ లో ఉన్న నల్లా బిల్లులు బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

మంగళవారం ప్రగతి భవన్‎లో జగల మండలి వన్ టైం సెటిల్‎మెంట్ పథకం కరపత్రాలు, పోస్టర్లను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నల్లా బిల్లులు కట్టని వారికి వడ్డీ మాఫీ చేస్తున్నట్లు, కేవలం అసలు మాత్రమే చెల్లిస్తే చాలని స్పష్టం చేశారు.

అయితే ఈ పథకం ఆఫర్ ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు అంటే 45 రోజుల పాటు అమలులో ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.ఇప్పటికే ఓటీఎస్ (వన్ టైం సెటిల్‎మెంట్ పథకం)కు సంబంధించిన జీవోను రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెల28వ తేదీన జారీ చేశారు.

పెండింగ్ లో ఉన్న బిల్లులను వసూలు చేసి బోర్డు ఆదాయం పెంచాలని జలమండలి సిబ్బందికి మంత్రి కేటీఆర్ సూచించారు.

Advertisement
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

తాజా వార్తలు