భారతదేశంలో ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవనీయమైనదిగా పరిగణించబడుతుంది.కానీ యూపీలోని హత్రాస్లో ఒక విస్మయకర ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులతో నిండిన తరగతిలో మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాకు చెందిన డిఆర్వి ఇంటర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.
వీడియోలో, అసిస్టెంట్ టీచర్ శైలేంద్ర సింగ్ గౌతమ్ విద్యార్థులతో నిండిన తరగతికి బోధించడాన్ని చూడవచ్చు.ఇక క్లాస్రూమ్లో విద్యార్థులకు పాఠాలు చెబుతూ బీరు డబ్బాతో ఎంజాయ్ చేస్తున్నాడు.
నిందితుడైన టీచర్, ఘటనను వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.మీకు కావాల్సినన్ని వీడియోలు చేసుకోండని తనకేమీ కాదని తేల్చి చెప్పాడు.
ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా మేజిస్ట్రేట్ సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, పాఠశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు.మరోవైపు నిందితుడిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు.స్కూల్ ఆపరేటర్, స్వతంత్ర కుమార్ గుప్తా, అసిస్టెంట్ టీచర్ను ప్రాథమికంగా దోషిగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు.ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశామని, దీనిపై తదుపరి విచారణ జరుపుతామని స్వతంత్ర కుమార్ గుప్తా తెలిపారు.
దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ చేపట్టనుంది.విద్యార్థుల ఎదుటే మద్యం సేవించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ టీచర్ శైలేంద్ర సింగ్ గౌతమ్ వీడియో 2015లో ఈ పాఠశాల ప్రైమరీ వింగ్లో నియమితులైనట్లు తెలిసింది.
ఈ ఘటన సెప్టెంబర్ 30 శుక్రవారం జరిగింది.దీనికి సంబంధించి మేనేజింగ్ కమిటీ సమావేశం, ముగ్గురు సభ్యుల కమిటీ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంది.
ఈ వీడియో వైరల్ కాగానే చాలా మంది నెటిజన్లు ఆయన తీరును తప్పుబడుతున్నారు.టీచర్ అయి ఉండి, ఇవేం పనులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవమైనదని, దాని పరువుతు తీయొద్దని కోరుతున్నారు.