ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుండి వస్తాయో ఊహించడం చాలా కష్టం.ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరు వచ్చి మనల్ని ఢీకొంటారో తెలియదు.
మనం రోడ్డు నిబంధనలు సరిగ్గా పాటించినా.ఎవరో మనకు ఏమాత్రం తెలియని వ్యక్తి చేసే చిన్న తప్పు, నిర్లక్ష్యం మన ప్రాణాలను బలి తీసుకుంటుంది.
అందుకే రోడ్డుపై వెళ్తున్న సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం అని చెబుతారు.ఒక్కో సారి అతి జాగ్రత్త కూడా చిన్న చిన్న ప్రమాదాలకు గురి చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే.
పంజాబ్ లోని సంగ్రూర్ లో జరిగిన ఘటన చూస్తుంటే.ప్రమాదం ఎటు వైపు నుండి పొంచి ఉందో తెలుసుకోవడం చాలా చాలా కష్టం అన్న విషయం అర్థం అవుతుంది.అసలేం జరిగిందంటే.30 ఏళ్ల భవీనా డగ్రోలీ ఉపాధ్యాయురాలు.పిల్లలను విద్యా బుద్ధులు నేర్పి వారిని జీవితంలో పైకి తీసుకురావడం ఆమె వృత్తి.రోజూ వెళ్తున్నట్లుగా ఆ రోజు కూడా తన స్కూటీపై బడికి బయలు దేరింది.
తాలిబ్ చౌక్ వద్దకు రాగానే స్కూటీపై వెళ్తున్న భవీనా డగ్రోలి పై నుండి లారీ దూసుకెళ్లింది.తప్పు ఎవరిదీ అనేది పక్కన పెడితే.చిన్న పొరపాటు, చిన్న ఏమరపాటు, నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది.ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.
వెంటనే అక్కడి నుండి పారిపోయాడు.కాసేపటికే పోలీసులు అతడిని పట్టుకున్నారు.
భవీనా మృతితో ఆమె ఐదేళ్ల కొడుకు, భర్త, ఇతర కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.