ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మంచి ఉత్సాహంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అదే ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించుకుంది.
ఇప్పుడు వరకు నిరాశ నిస్పృహంలో ఉన్న టిడిపి క్యాడర్ కూడా ఎన్నికల ఫలితాలతో యాక్టివ్ కావడం టిడిపిలో జోష్ నింపుతోంది.ఇప్పటికే యువ గళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara lokesh ) పాదయాత్ర కొనసాగిస్తుండగా, టిడిపి అధినేత చంద్రబాబు జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ముందుగానే బాబు ప్రకటిస్తున్నారు.
చాలా నియోజకవర్గాలకు అనాధికారికంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.అయితే చాలా నియోజకవర్గాల నుంచి ఇద్దరు ముగ్గురు కీలక నాయకులు టికెట్ ఆశిస్తూ ఉండడంతో వారిలో ఎవరిని ఎంపిక చేయాలని విషయం పై తర్జనభర్జన పడుతున్నారు.ఇప్పటికే టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ప్రకటించిన బాబు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
టిడిపి , జనసేన పొత్తు( Janasena ) ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తుండడంతో , అభ్యర్థుల ప్రకటనపై మరి కొంతకాలం వేచి చూడాలని భావిస్తున్నారు.టిడిపి సీనియర్ నాయకులు ఈసారి ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉంటామని, తమ స్థానంలో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
దీంతో అభ్యర్థుల ప్రకటన విషయంలో బాబు( Chandrababu Naidu ) ముందుగా ఆలోచించిన విధానం ప్రకారం ముందుగానే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నా.తాజాగా నెలకొన్న పరిస్థితులతో మరికొంత కాలం వేచి చూడాలని నిర్ణయించుకున్నారట.
చాలా నియోజకవర్గాల నుంచి టికెట్ హామీ పొందిన నేతలు, టికెట్ ఆశిస్తున్న వారు తమను అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించాలని, అలా ప్రకటిస్తే తాము ధైర్యంగా జనాల్లోకి వెళ్లి పనిచేసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారట.ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో చంద్రబాబు సైతం ఆలోచనలో పడ్డారట.