గత కొంత కాలంగా ఏపీలో ఉన్న హిందు ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సంఘటనల విషయంలో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుండగా దీనికి బాధ్యులు మీరంటే మీరని టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం ఆరోపణలతో మాటల దాడులు చేసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో ఈ వివాదంలోకి పోలీసు అధికారులను కూడా లాగుతున్న విషయం తెలిసిందే.ఈ అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ దాడుల వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందని, అదీగాక రాజకీయ పార్టీల ప్రమేయంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు.
ఇలాంటి ఎన్నో ఘోరాలు చేస్తున్న వారిని పట్టుకుని శిక్షించడం చేతకాక, విగ్రహాల ధ్వంసంకు సంబంధించిన వార్తలను సామాజిక మాధ్యమాల్లో ఫార్వార్డ్ చేసిన టీడీపీ సానుభూతి పరులను నిందితులుగా చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం భావ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేగాక డీజీపీ గారూ ఖాకీ డ్రెస్ తీసేసి తాడేపల్లి కొంపలో బులుగు కండువా కప్పుకోవచ్చు కదా అంటూ మండిపడ్డారట అచ్చెన్నాయుడు.