తెలుగుదేశం జనసేన కూటమి( TDP Janasena Alliance ) తొలి జాబితా నేడు విడుదల చేయడం జరిగింది.చంద్రబాబు( Chandrababu ) మరియు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కలసి మొదటి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడం జరిగింది.
ఈ జాబితాలో 24 అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికలలో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకటమే కూటమి లక్ష్యమని చంద్రబాబు తెలియజేశారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయని విధంగా హోంవర్క్ చేసి అందరి అభిప్రాయాలు సేకరించి పేర్లను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.అయితే తొలి జాబితాలో చాలామంది టీడీపీ సీనియర్ల పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గంటా శ్రీనివాసరావు, యరపతనేని శ్రీనివాసరావు, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, కళా వెంకట్రావ్, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా మరి కొంతమంది పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు.పరిస్థితి ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్( Mandali Buddha Prasad ) తొలి జాబితా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం జనసేన కూటమి తొలి లిస్టులో అవనిగడ్డ నుంచి తన పేరు ప్రకటించినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.పంజరం నుంచి బయటకు వచ్చిన స్వేచ్ఛ పక్షిలా ఉన్నా… మన కళ్ళ ముందే రాజకీయాలు మారిపోయాయి.
డబ్బే ప్రధానమయింది.ఓటరును కొనుగోలు వస్తువుగా రాజకీయ పక్షాలు భావిస్తున్న తరుణంలో నాలాంటి వాడు ఎన్నికలలో నిలబడాలని భావించటం సమంజసం కాదు అని కార్యకర్తలకు తెలియజేశారు.