టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నించాడు.కానీ సరైన హిట్లు లేకపోవడంతో ఈ హీరో ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు.
ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటించిన సుశాంత్, ప్రస్తుతం హీరోగా మరో సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు దర్శన్ డైరెక్షన్లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న సినిమాలో సుశాంత్ నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.కాగా కరోనా కారణంగా సినిమా షూటింగ్లు వాయిదా పడగా, ప్రస్తుతం సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.
అయితే హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.ఈ వర్షాలకు భాగ్యనగరం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
కానీ ఈ వర్షాలను కూడా లెక్కచేయకుండా సుశాంత్ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు.ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా షూటింగ్ను ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంలో సుశాంత్కు జోడీగా మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.ఈ నెలాఖరులోగా ఈ సినిమా షూటింగ్ను ముగించేయాలని సుశాంత్ అండ్ టీమ్ భావిస్తోంది.
వీలైనంత త్వరగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమాతో సుశాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ఈ సినిమాతో హీరోగా అదిరిపోయే సక్సెస్ కొట్టాలని సుశాంత్ గట్టగా ప్రయత్నిస్తున్నాడు.