జనసేనతో పొత్తు ఉంటుంది క్లారిటీ ఇచ్చిన సునీల్ దియోధర్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నిమిషం నిమిషానికి మారిపోతుంది.“విశాఖ గర్జన” ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని హోటల్లో నిర్బంధించిన తర్వాత ఏపీలో పరిస్థితులు మొత్తం మారిపోయాయి.ముఖ్యంగా మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ స్పీచ్ ఇచ్చిన తరువాత పవన్ నీ చంద్రబాబు విజయవాడ నోవాటెల్ హోటల్ లో  కలవటం సంచలనంగా మారింది.అదే సమయంలో బీజేపీనీ లైట్ తీసుకున్నట్లు పవన్ మాట్లాడటం జరిగింది.

 Sunil Deodhar Sensational Comments On Bjp Janasena Allianace Sunil Deodhar, Bjp,-TeluguStop.com

దీంతో జనసేన బీజేపీ పొత్తుపై నెగటివ్ కామెంట్లు వస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో ఏపీ బీజేపీ కో కన్వీనర్ సునీల్ దియోధర్ జనసేనతో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతుందని తెలిపారు.ఇక వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతల గురించి మాట్లాడుతూ ఒకరు సర్పరాజు అయితే మరొకరు నాగరాజు అని ఎద్దేవా చేశారు.

వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు దొంగ పార్టీలేనని విమర్శించారు.అంతేకాదు భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.

కన్నా వ్యాఖ్యలపై తానేమి చెప్పలేనని పేర్కొన్నారు.పవన్ రోడ్డు మ్యాప్ విషయంలో ఎటువంటి గందరగోళం లేదని అన్నారు.

దీంతో సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube