ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నిమిషం నిమిషానికి మారిపోతుంది.“విశాఖ గర్జన” ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని హోటల్లో నిర్బంధించిన తర్వాత ఏపీలో పరిస్థితులు మొత్తం మారిపోయాయి.ముఖ్యంగా మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ స్పీచ్ ఇచ్చిన తరువాత పవన్ నీ చంద్రబాబు విజయవాడ నోవాటెల్ హోటల్ లో కలవటం సంచలనంగా మారింది.అదే సమయంలో బీజేపీనీ లైట్ తీసుకున్నట్లు పవన్ మాట్లాడటం జరిగింది.
దీంతో జనసేన బీజేపీ పొత్తుపై నెగటివ్ కామెంట్లు వస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో ఏపీ బీజేపీ కో కన్వీనర్ సునీల్ దియోధర్ జనసేనతో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతుందని తెలిపారు.ఇక వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతల గురించి మాట్లాడుతూ ఒకరు సర్పరాజు అయితే మరొకరు నాగరాజు అని ఎద్దేవా చేశారు.
వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు దొంగ పార్టీలేనని విమర్శించారు.అంతేకాదు భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
కన్నా వ్యాఖ్యలపై తానేమి చెప్పలేనని పేర్కొన్నారు.పవన్ రోడ్డు మ్యాప్ విషయంలో ఎటువంటి గందరగోళం లేదని అన్నారు.
దీంతో సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి.