సాహో సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సుజిత్.రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడుగా అడుగుపెట్టిన ఈ యంగ్ క్రియేటర్ రెండో సినిమానే ఏకంగా ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.
ఈ సినిమా తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకున్నా హిందీలో హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా తర్వాత మెగాస్టార్ లూసీఫర్ రీమేక్ బాద్యతలు సుజిత్ కి అప్పగించిన అతను హ్యాండిల్ చేయలేనని తప్పుకున్నాడు.
తరువాత యూవీ క్రియేషన్స్ లోనే గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేస్తాడనే టాక్ వచ్చింది.అయితే అది కూడా పట్టాలెక్కలేదు.
శర్వానంద్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగిన అది కూడా సెట్ కాలేదు.అయితే సుజిత్ టాలీవుడ్ ని పక్కన పెట్టి ముంబై వెళ్లిపోయి అక్కడ యూరీ సినిమాతో స్టార్ హీరోగా మారిన విక్కీ విశాల్ తో సినిమా చేయడానికి కమిట్ అయిపోయాడు.
అతనికి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథని చెప్పి ఒప్పించేశాడు.దీంతో ఈ సినిమాని పట్టాలు ఎక్కించేందుకు హీరో, దర్శకుడు రెడీ అయిపోయారు.
జీ స్టూడియో’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తుంది.ఇక త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.
దీని కోసం దర్శకుడు ఇప్పటికే ముంబైకి మకాం మార్చేసి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.కంప్లీట్ బాలీవుడ్ టీంతోనే ఈ సినిమాని సుజిత్ చేయబోతున్నాడు.
దీని తర్వాత తెలుగులో గోపీచంద్ సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.