డ్రగ్స్ కేసులో కొత్త మలుపు .. కొత్త పేర్లు చెప్పిన సుబ్బరాజు

టాలివుడ్ డ్రగ్స్ కేసులో రోజూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి, కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.

రెండురోజుల్లో, ఇద్దరు వ్యక్తులు దర్శకుడు పూరి జగన్నాథ్ నే టాలివుడ్ డ్రాగ్ మాఫియా డీలర్ గా చూపెట్టడం విశేషం.

మొన్న కెమెరామెన్ శ్యాం కె నాయుడు పూరి జగన్నాథ్ కి రేవ్ పార్టీలు, సీక్రెట్ పార్టీలు ఆర్గనైజ్ చేసే అలవాటు ఉందని, అక్కడికి వచ్చే గెస్టులందరినీ మచ్చిక చేసుకోవడానికి, వారితో సంబంధాలు కలుపుకోవడానికి డ్రగ్స్ తెప్పిస్తూ ఉంటారని, తానూ కూడా తీసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే.ఇక సిట్ అధికారులు పూరి జగన్నాథ్ కి ఉన్న మరో సన్నిహితుడు, నటుడు సుబ్బరాజుని దాదాపుగా 12 గంటలు విచారించారు.

నిన్న సాయంత్రం దాకా సుబ్బరాజు నుంచి ఎలాంటి నిజాలు బయటపడలేదట.దాంతో అధికారులు ప్రశ్నావళికి పూర్తిగా మార్చేసి, కొన్ని సాక్ష్యాలు చూపిస్తూ సుబ్బరాజుని ఉక్కిరిబిక్కిరి చేయడంతో మెల్లిగా నిజాలు బయటకి వచ్చాయట.

పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడతారని, థైలాండ్ నుంచి డ్రగ్స్ ని విమాన మార్గాల్లో లేదా సముద్ర మార్గంలో హైదరాబాద్ కి తెప్పిస్తారని, వాటిని పార్టీల్లో ఇస్తూ, సంబంధాలు పెంచుకుంటారని సుబ్బరాజు అప్రూవర్ తరహాలో మొత్తం బయటపెట్టేసారట.ఇద్దరు నిర్మాతల కొడుకులు (వాళ్ళు కూడా హీరోలు) కూడా డ్రగ్స్ వాడుతున్నారట.

Advertisement

అంతేకాదు, ఇప్పుడు ఫామ్ లో ఉన్న ఒక క్రేజీ హీరోయిన్ కూడా డ్రగ్స్ కి బానిసె అని సుబ్బరాజు అసలు పేర్లు కూడా సిట్ అధికారులకి చెప్పెసారట.ఓ సీనియర్ నటుడి కుమార్తె కూడా ఈ లిస్టులోకి వచ్చింది.

కెమెరామెన్ శ్యాం కె నాయుడు బయటపెట్టిన పేర్లు కొన్ని సుబ్బరాజు చెప్పిన పేర్లు కొన్ని మ్యాచ్ అయ్యాయి.సుబ్బరాజు అధికారులకి తెలియని కొన్ని కొత్త పేర్లను కూడా వేడిలోకి తీసుకొచ్చారు.

ఇలాంటి వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని, ప్రముఖులు కూడా ఉన్నారు, డ్రగ్స్ వాడటాన్ని గొప్పలా భావించే వారు కూడా ఉన్నారని సుబ్బరాజు అన్నారట.పూరి జగన్నాథ్, శ్యాం కె నాయుడు లానే తన రక్తం సాంపిల్, గోర్లు, వెంట్రుకలు అధికారులకి ఇచ్చారు సుబ్బరాజు.

ఈరోజు హీరో తరుణ్ ని విచారించనున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు