అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మధునాయుడు

సూర్యాపేట జిల్లా: అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మద్దిరాల ఎస్ఐ మధు నాయుడు హెచ్చరించారు.బుధవారం మద్దిరాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా నివారణకు మద్దిరాల పోలీసులు మరియు రెవెన్యూ మైనింగ్ రవాణా శాఖ సమన్వయంతో పనిచేస్తూ ఇసుక రవాణా నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.

 Strict Action Against Illegal Sand Transport Si Madhunayudu , Si Madhunayudu, Il-TeluguStop.com

కొందరు ప్రభుత్వ అనుమతితో రవాణా చేస్తున్నారని, అదికూడా ఎక్కడి వరకు అనుమతి ఉంటే అక్కడికే రవాణా చేయాలని, అనుమతి ఉన్న చోట కాకుండా వేరొక చోటుకు రవాణా చేసినా,మరియు అక్రమంగా ఇసుక డంపు చేసినా కూడా చర్యలు తప్పవన్నారు.ఇసుక రవాణాతో పాటు గ్రామంలో పిడిఎఫ్ బియ్యం,నాటు సారాయి తయారు చేయుటకు ఉపయోగించే బెల్లం తరలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని మండల ప్రజలను కోరారు.

పోలీసులకు ప్రజల సహాయం సహకారం ఉండాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube