హైదరాబాద్ లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టీల్ ప్లైఓవర్.!

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది.ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన ఈ స్టీల్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.

 Steel Plyover Ready For Opening Ceremony In Hyderabad.-TeluguStop.com

ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా వీఎస్టీ వరకు సుమారు 2.6 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం జరిగింది.దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది.సుమారు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లైఓవర్ కు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టింది ప్రభుత్వం.ఈ బ్రిడ్జికి జూలై 11, 2020 లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా సరిగ్గా మూడేళ్ల కాలంలో ఈ ప్లైఓవర్ నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

కాగా దక్షిణాదిలోనే అత్యంత పొడవైన స్టీల్ ఫ్లైఓవర్ ఇదే కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube