తాజాగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర (New Zealand all-rounder Rachin Ravindra)పాకిస్థాన్తో శనివారం జరిగిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్లో భారీగా గాయపడ్డాడు.న్యూజిలాండ్ బౌలర్ మైఖేల్ బ్రేస్వెల్ బౌలింగ్లో (New Zealand bowler Michael Bracewell bowling) పాకిస్థాన్ బ్యాటర్ కుష్దిల్ షా స్క్వేర్ లెగ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడగా, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టే(Rachin Ravindra takes a catch.
) ప్రయత్నంలో బంతి నేరుగా అతని నుదిటిని తాకడంతో ఒక్కసారిగా భారీగా రక్తస్రావం జరగడంతో ఫిజియోలు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా చెక్కర్లు కొడుతుంది.
అలాగే ఈ క్రమంలో రచిన్ రవీంద్ర(Rachin ravindra) త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
ఇక రచిన్ రవీంద్ర గాయపడ్డప్పటికీ, స్ట్రెచర్ అవసరం లేకుండా స్వయంగా నడుచుకుంటూ మైదానం విడిచాడు.ఆ తరువాత అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనను చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన సమయంలో మైదానం నిశ్శబ్దంగా మారింది.కొంతమంది నెటిజన్లు ఈ సంఘటనను ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఘటనను గుర్తు చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు రచిన్ రవీంద్ర గాయపడటం న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.ఆరవ బాట్స్మెన్ గా వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ చివరిలో తుఫాన్ ఇన్నింగ్స్ తో 106 నాటౌట్, డారిల్ మిచెల్ 81, కేన్ విలియమ్సన్ 58 పరుగులతో రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 3 వికెట్లు, అబ్రర్ అహ్మద్ 2 వికెట్లు, హారిస్ రౌఫ్ 1 వికెట్లు తీశారు.