బుల్లితెర జబర్దస్త్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, ఇతర కామెడీ షోల ద్వారా హైపర్ ఆది ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.ఢీ షో ప్రోమో తాజాగా విడుదల కాగా ఈ షోకు సుధీర్ బాబు గెస్ట్ గా హాజరయ్యారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ నాకు ఏదైనా ట్రైనింగ్ ఉందంటే శేఖర్ మాస్టర్ ట్రైన్ చేస్తారని చెప్పగా హైపర్ ఆది వెంటనే సుధీర్ బాబు ఎస్.ఎం.ఎస్ అనే సినిమా ఒక్కసారే చేశారని ఆరోజు నుంచి శేఖర్ మాస్టర్( Sekhar Master ) మాత్రం రోజూ అందరికీ ఎస్.ఎం.ఎస్ లు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ప్రేమకథా చిత్రమ్ సినిమాలో దెయ్యాన్ని చూస్తే సుధీర్ బాబు పారిపోయారని కానీ శేఖర్ మాస్టర్ ను చూస్తే దెయ్యం పారిపోతుందని ఆది అన్నారు.హన్సిక వెంటనే “ఆదీ( Hyper Aadi ).శేఖర్ మాస్టర్ చాలా మంచివాడు.నీ నోరు మూసుకో” అని వార్నింగ్ ఇవ్వడంతో షాకవ్వడం ఆది వంతైంది.హైపర్ ఆది వెంటనే నాలుగో ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోతుందని కామెంట్ చేయగా మీరు నాలుగు ఎపిసోడ్స్ తర్వాత వెళ్లిపోతున్నారా అంటూ హన్సిక రియాక్ట్ అయ్యారు.
వెళ్లిపోయేలా ఉంటే ఇప్పుడే వెళ్లిపోండి అంటూ హన్సిక( Hansika ) ఆది పురువు తీసేశారు.ఈ నెల 12వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు హన్సికకు ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం దక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ షో బుల్లితెరపై మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
ఈ షోకు ఒకింత భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.గతంతో పోల్చి చూస్తే ఢీ షోలో మాత్రం కీలక మార్పులు చేయడం జరిగింది.
ఆ మార్పులు ఈ షోకు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాల్సి ఉంది.గతంతో పోల్చి చూస్తే రియాలిటీ షోలకు ఒకింత ఆదరణ తగ్గుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఢీ షో ఇప్పటికే చాలా సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.