ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన చిత్రం అతడు.ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్ గా గోవా బ్యూటీ త్రిష నటించింది.
అతడు సినిమా ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన మోసం ఆధారంగా తెరకెక్కింది ఇద్దరి స్నేహితుల పాత్రల్లో మహేష్ బాబు, సోను సూద్ నటించగా, సోనుసూద్ మహేష్ బాబును ఎందుకు మోసం చేశాడు ఎలా మోసం చేశాడనే కథనంతో స్క్రీన్ ప్లే అద్భుతంగా పండింది.ఈ సినిమా కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ తూటాలా ప్రేక్షకుడి హృదయాన్ని హాత్తుకున్నాయి.
ఒక్కో డైలాగ్ కూడా ఒక రేంజ్ లో విజిల్స్ వేయించింది థియేటర్లలో.ఈ చిత్రంలో అనేక మంది స్టార్ హీరోలు నటించాల్సింది ఉండగా వారి వారి కారణాలతో ఈ సినిమాను మిస్ చేసుకున్నారు దాంతో ఈ సినిమాలో మహేష్ బాబు మెయిన్ లీడ్ గా అలాగే సోను సూద్ మరొక లీడ్ పాత్రలో నటించారు.
వాస్తవానికి మనందరికీ తెలిసిన విషయమే ఈ సినిమాలో తొలిత ఉదయ్ కిరణ్ హీరోగా నటించాల్సి ఉంది కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ కాకుండా మహేష్ బాబు హీరోగా చేయాల్సి వచ్చింది.ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తర్వాత చిరంజీవి కుమార్తె సుస్మిత తో తన నిశ్చితార్థం క్యాన్సిల్ కావడం, అదే సమయంలో ఈ సినిమా కూడా ఉదయ్ కిరణ్ చేజారిపోవడం చకచకా జరిగిపోయాయి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాల్సి ఉండగా తనకు కథ నచ్చలేదంటూ రిజెక్ట్ చేయడంతో చివరగా మహేష్ కి ఫిక్స్ అయ్యారు చిత్ర యూనిట్.
ఇక కేవలం మహేష్ బాబు పాత్ర పాత్ర మాత్రమే కాదు.ఈ సినిమాలో నాజర్ స్థానంలో సైతం అలనాటి స్టార్ హీరో శోభన్ బాబుతో నటింపచేయాలని ఈ సినిమా ప్రొడ్యూసర్ మురళీమోహన్ భావించగా శోభన్ బాబు ఎందుకో గాని ఈ కథను రిజెక్ట్ చేయగా చేశారు.దాంతో నాజర్ కి ఆ అవకాశం వరించింది.
ఇక ఇప్పుడు మరొక ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది.అదేంటంటే ఈ సినిమాలో సోనూసూద్ పాత్ర కోసం టాలీవుడ్ అమితాబచ్చన్ అయిన హీరో వేణుని కూడా త్రివిక్రమ్ సంప్రదించాడట.
ఈ విషయం వేణు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టడంతో అందరూ షాక్ కి గురయ్యారు.ఎందుకంటే సోను సూద్ పాత్ర అంతగా అభిమానుల మనసుల్లో నాటుకు పోయింది.
ఇలా హీరో వేణు సోను సూద్ పాత్రలో కనుక నటించి ఉంటే ఈరోజు వేణు కెరియర్ మరోలా ఉండేది.ఈ ఒక్క పాత్ర కాదు త్రివిక్రమ్ తనకు చాలా మంచి పాత్రలు ఆఫర్ చేసినప్పటికీ తానే ఆ పాత్రలన్నీ కూడా రిజెక్ట్ చేశానంటూ వేణు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.