నవంబర్ 1 నుంచి తిరుపతిలోనే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ

నవంబర్ 1 నుంచి తిరుపతిలోనే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ కానున్నాయి.

ఏ రోజుకు ఆ రోజు మాత్రమే భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.

శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని రెండో సత్రంలో టోకెన్లు జారీ చేయనున్నారు.ఈ నేపథ్యంలో టోకెన్లు లభించని భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని వేచి ఉంటే శ్రీవారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 నిమిషాల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు టీటీడీ అధికారులు.శ్రీవాణి ట్రస్ట్ భక్తుల కోసం తిరుపతి మాధవ నిలయంలో 140 గదులు కేటాయించినట్లు తెలిపారు.

వీటన్నింటినీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని టీటీడీ ఈవో స్పష్టం చేశారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు