సమాధానం చెప్పండి: టీడీపీ నేతలకు స్పీకర్ నోటీసులు ?

ఏపీ టీడీపీ నేతలకు షాక్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్.గత కొంత కాలంగా అధికార పార్టీ వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు టీడీపీ నేతలు.

 Speker Notices To Tdp Leaders-TeluguStop.com

ఈ నేపథ్యంలో స్పీకర్ ను ఉద్దేశించి తెలుగుదేశం నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని,తద్వారా స్పీకర్ పదవి ని అగౌరపరిచేలా తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.

స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ నోటీసులు అందించినట్టు సమాచారం.

ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ సభాహక్కుల నోటీసులను వారికి అందించారు.ఆ నోటీసులపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ నోటీసుల నేపథ్యంలో దానికి ఎటువంటి సమాధానం ఇవ్వాలనే విషయమై టీడీపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube