ఏపీ టీడీపీ నేతలకు షాక్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్.గత కొంత కాలంగా అధికార పార్టీ వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు టీడీపీ నేతలు.
ఈ నేపథ్యంలో స్పీకర్ ను ఉద్దేశించి తెలుగుదేశం నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని,తద్వారా స్పీకర్ పదవి ని అగౌరపరిచేలా తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.
స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ నోటీసులు అందించినట్టు సమాచారం.
ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ సభాహక్కుల నోటీసులను వారికి అందించారు.ఆ నోటీసులపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ నోటీసుల నేపథ్యంలో దానికి ఎటువంటి సమాధానం ఇవ్వాలనే విషయమై టీడీపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు.