7వ తేదీన ప్రత్యేక బీసీ కమిషన్ పర్యటన - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ నెల 7వ తేదీ శనివారం ప్రత్యేక బీసీ కమిషన్ కరీంనగర్ జిల్లా కేంద్రానికి రానుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో వెనుకబాటుతనం, వాటి స్వభావం, ప్రభావాన్ని సమకాలీన, క్షున్నమైన, అనుభవపూర్వక విచారణను నిర్వహించడానికి ఒక ప్రత్యేక బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

 Special Bc Commission Visit On 7th Collector Sandeep Kumar Jha, Special Bc Commi-TeluguStop.com

కరీంనగర్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో కమిషన్, గౌరవ సభ్యులు ఈ నెల 07-12-2024 తేదీ శనివారం 10.30 AM నుంచి 2.00 వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రజా అభిప్రాయము సేకరిస్తారని పేర్కొన్నారు.

రాతపూర్వక సమర్పణలు, అభ్యర్ధనలు తెలుగు / ఇంగ్లీష్ భాషలో తెలంగాణ వెనుకబడిన తరగతుల చైర్మన్, డెడికేటెడ్ కమిషన్ వారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube