ఈ మధ్య చాలా మంది ఆర్టిస్ట్ లు ఒకటి రెండు షార్ట్స్ ఫిల్మ్స్ గానీ వెబ్ సీరీస్ లు గానీ చేసి మంచి పేరు సంపాదించుకుంటున్నారు…అలాంటి వాళ్లలో ఈమె కూడా ఒకరు ఆమె ఎవరు అనేది తెలియాలంటే మహి వి రాఘవ్( Mahi V Raghav ) దర్శకత్వంలో ఇటీవల ఓ బూతు వెబ్ సిరీస్( Web series ) గురించి తెలుసుకోవాలి…ఆ సీరీస్ పేరే సైతాన్( Saithan )… ఇందులో మెయిన్ లీడ్ చేసిన బాలి తల్లిగా నటించిన సావిత్రిని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు.ఈమె ట్రైలర్లో అయితే తల్లిగా పద్ధతిగానే కనిపించింది కానీ.
సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఓ పోలీస్ కి ఉంపుడుగత్తెగా రెండు, మూడు ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి షాకిచ్చింది.ఈ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది ఈ సీనియర్ నటి.

ఇంతకీ ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వంటి ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి.‘సైతాన్’ వెబ్ సిరీస్ లో హీరో తల్లి సావిత్రి పాత్రని పోషించిన నటి పేరు షెల్లీ నబుకుమార్ ( Shelly Nabukumar )అలియాస్ షెల్లీ కిషోర్.ఒకప్పుడు మలయాళం సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఈమె 1983 ఆగస్టు 18న దుబాయ్లో జన్మించింది.ఒకసారి మలయాళ మనోరమ న్యూస్ పేపర్లో ‘కనల్ కన్నడి’ ( Kanal Kannadi )ఫిలిం మేకర్ తమ సినిమాలకు కాస్టింగ్ కాల్ యాడ్ ఇవ్వడం జరిగింది.

అది చూసిన షెల్లీ ఫ్రెండ్ ఆ విషయాన్ని ఆమెకు చెప్పగా వెంటనే అప్లై చేసి, ఆడిషన్ ఇచ్చి ఛాన్స్ కొట్టేసింది.కానీ ఆ మూవీ రిలీజ్ కాలేదు.ఈ క్రమంలో ఆమెకు ‘పురుషోత్తమ్’( Purushottam ) సీరియల్ డైరెక్టర్కి ద్వారా ‘చిత్రశలభం’( Chitra Shalabh ) అనే సీరియల్లో ఛాన్స్ దక్కించుకుంది.
ఆ తర్వాత ‘కుట్టు కుడుంబం’ సీరియల్ లో కూడా నటించింది.ఆ తర్వాత ‘థనీ’ అనే సీరియల్ ద్వారా ఈమె ప్రేక్షకులకి దగ్గరైంది.ఆ తర్వాత పెద్ద స్టార్ అయిపోయింది.2009లో మెగాస్టార్ మమ్ముట్టి ‘కేరళ కేఫ్’ ( Kerala Cafe )మూవీతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకి దగ్గరైంది.ఇప్పుడు ‘సైతాన్’ సీరీస్ తో ఈమెకు మరింత మంచి పేరు వచ్చిందని చెప్పాలి…ఇక ప్రస్తుత ఆమె చేతిలో చాలా సీరీస్ లు సినిమాలే ఉన్నాయని చెప్పాలి…
.