గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.వట్టి చెరుకూరు వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా సుమారు 20 మందికి గాయాలు అయ్యాయి.గమనించిన స్థానికులు గాయపడిన వారికి జీజీహెచ్ కు తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు ప్రత్తిపాడు మండలం కొండపాడుకు చెందిన వారిగా గుర్తించారు.