లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి( Nandini Reddy ) మరో క్రేజీ జంటతో కొత్త సినిమాను తెరకెక్కించ బోతున్నారు.ఇటీవలే ‘అన్నీ మంచి శకునములే’( Anni Manchi Sakunamule ) సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన నందిని రెడ్డి ఇప్పుడు ఆమె నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టింది.
ఈమె నెక్స్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) తో తీయబోతున్నట్టు కన్ఫర్మ్ చేసేసింది.
మరి ఈ సినిమాలోనే సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, రూత్ ప్రభు( Samantha ) హీరోయిన్ గా నటించ బోతుంది అని టాక్ వినిపిస్తుంది.
సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.ముఖ్యంగా ఈమె విజయ్ తో చేసే ఖుషి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ క్రమంలోనే ఈమె ఈ సినిమాకు కూడా ఓకే చేసినట్టు రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.

ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసుకుందట.త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు బివిఎస్ రవి కథ అందించనున్నాడు.
ఇక ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, సమంత కాంబో నటిస్తున్నారు అని తెలిసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ కాంబో ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.
సమంత ఉండడంతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగి పోతుంది.సిద్ధూకు కూడా యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
అందుకే ఈ లంబోపై యువత బాగా ఆసక్తిగా ఉన్నారు.

కుటుంబ కథ చిత్రాలతో అలరించే నందిని రెడ్డితో సిద్ధూ నటించడం విశేషం.ఇప్పటికే సమంత, నందిని రెడ్డి కాంబోలో ఓ బేబీ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.దీంతో వీరి రెండవ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
చూడాలి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందో.