నార్త్ సౌత్ సినిమాల గురించి శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్?

కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

కెరియర్ మొదట్లో ఎన్నో ఫ్లాప్ సినిమాలను చెవి చూసిన శృతిహాసన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు.

ఇక ఈమె సినిమాలకన్నా వ్యక్తిగత విషయాల వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన శృతిహాసన్ పలు వ్యక్తిగత విషయాల గురించి మాత్రమే కాకుండా వృత్తిపరమైన విషయాల గురించి కూడా వెల్లడించారు.

ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో నార్త్ సౌత్ అనే భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి.సినిమాలకు సౌత్ లో పెద్దగా ఆదరణ లేకపోయినా సౌత్ సినిమాలు మాత్రం నార్త్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి అంటూ పెద్ద ఎత్తున ఈ రెండు సినీ ఇండస్ట్రీల మధ్య వివాదం చెలరేగింది.

ఈ క్రమంలోనే నటి శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నార్త్ సౌత్ సినీ పరిశ్రమల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ.

Advertisement

తాను నార్త్ సౌత్ పరిశ్రమలకు చెందిన వ్యక్తిని.నేను బహుభాషా గృహంలో పెరిగాను.మా ఇంట్లో రెండు భాషలకు సంబంధించిన వేర్వేరు కళాకారులు ఉన్నారు.

నా చిన్నప్పటి నుంచి తాను రెండు సినీ పరిశ్రమలను చూస్తూ పెరిగానని ఈ సందర్భంగా శృతిహాసన్ ఇండస్ట్రీ గురించి కామెంట్ చేశారు.కలకు భాష లేదు నేను సాంబార్ అన్నం ఎలా అయితే ఇష్టపడతానో దాల్ చావల్ కూడా అదే విధంగా ఇష్టపడతానని అందుకే నాకు భాషా వ్యత్యాసం కనిపించలేదని ఈ సందర్భంగా శృతిహాసన్ నార్త్, సౌత్ సినీ పరిశ్రమ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు