మహేష్ బాబు ఒళ్లు హునం చేయబోతున్న జక్కన్న.. ఏకంగా అన్ని నెలల ట్రైనింగా?

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లలో మహేష్ బాబు రాజమౌళి కాంబో( Mahesh Babu-Rajamouli Combo ) మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు, 1500 కోట్లు అని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబు ఒళ్లు హూనం చేయబోతున్నారని తెలుస్తోంది.రాజమౌళి సినిమా అంటే యాక్షన్ సీక్వెన్స్ లు కఠినంగా ఉంటాయి.

ఈ సినిమా కోసం మహేష్ బాబు మూడు నెలలు ట్రైనింగ్ తీసుకోనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఈ ఏడాది డిసెంబర్ నుంచి మహేష్ కు విదేశాల్లో శిక్షణ ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.మహేష్ త్రివిక్రమ్( Trivikram Srinivas ) సినిమాను వేగంగా పూర్తి చేసి రాజమౌళి సినిమాతో బిజీ కావాల్సి ఉంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2026 సంవత్సరం లేదా 2027 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా గత సినిమాలతో ఎలాంటి పోలిక లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

Advertisement

రాజమౌళి మహేష్ కాంబో మూవీకి కేఎల్ నారాయణ( Producer KL Narayana ) నిర్మాత కాగా బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటంతో మరి కొంతమంది నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.రాజమౌళి ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారని సమాచారం.

ఫుల్ యాక్షన్ మూవీ( Full Action Entertainer )గా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.మహేష్ రాజమౌళి కాంబో మూవీ చరిత్ర సృష్టిస్తుందని చరిత్ర తిరగరాస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ రాజమౌళి కాంబో మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు